శ్రీకృష్ణ జన్మస్థానం అలా అల్లంత దూరంలో కనపడగానే మన నాయకులకి ఏ గుండెనోప్పో , బీపీ లాంటివో, ఇంకేవేవో వచ్చేసి అమాంతం స్ట్రెచెర్ మీద పడుకుండి పొతారు. అప్పటిదాకా టీవీ కేమెరాలముందు వేసిన వీరంగం,వాగిన వెధవ వాగుడు కట్టిపెట్టి మాట మాత్రం పెగలని ఆస్కార్ నటులవుతారు. ఇక ఆస్పత్రి కెళ్ళాక లొపలేం జరుగుతుందో ఆ దేవుడి కెరుక. ఫాపం వాళ్ళలొ కొద్దిమంది దురదృష్టవంతులుంటారు కల్మాడి గారి లాగా.గుండె పట్టుకునే లోపే తీస్కెళ్ళి లొపలపడేస్తారు వాళ్ళని.
ఇక విషయానికొస్తే, మన కల్మాడీ గారికి మతిమరుపు వ్యాధి వచ్చేసిందట. దీనర్ధం ఏమిటంటే కేసుకి సంబంధించిన ఆస్తుల వివరాలూ, జరిపిన మంతనాలూ,కలిసిన వ్యక్తులూ ఎవరూ గుర్తుండరు అన్నమాట . వ్యాధి ఇంకా ప్రాధమిక దశలోనే ఉందట. బహుశా కేసు తిరిగే మలుపులు బట్టి ఈ మతిమరపు వ్యాధి స్థాయి పెరగొచ్చు. "తెలీదు" అంటే తప్పుగానీ, "గుర్తు లేదు" అంటే అది తప్పుకాదు అనే లాజిక్ ఏ లాయరు మహాశయునికొచ్చిందో, దానికి ఏ డాక్టరు వత్తాసు పలికాడొ గాని, వాళ్ళకి జేజేలు. ఇల్లుకాదు ఇది జైలే, దీన్నుంచి తిమ్మిని బమ్మి చేసైనా బయటపడాలి అనేది మాత్రం మరపుకు రాదండోయ్ . మీరు భలే ఉన్నారే. "అమ్మా! ఆశ,దోశ, అప్పడం వడ.." .
ఏదేమైనా దేశపు పరువుకి పాతరేసి దొరికినంత దోచుకొవాలనుకుంటున్నోళ్ళకి కల్మాడీ ఈవిధంగా మార్గదర్శి కావటం మూడొంతుల పార్లమెంటు సభ్యులు గర్వించదగ్గ విషయం.
The Verdict సినిమాలో అనుకుంటా, హీరో అంటాడు "Courts will not give you Justice, only they will give you a CHANCE to get it అని( డైలాగు సరిగా గుర్తులేదు, అర్ధం మాత్రం ఇదే).అయినా జెత్మలానీలూ, జెట్లీలాంటి దేశ భక్తులున్నప్పుడు ఆ ఛాన్స్ మనకెలా ఇస్తారు చెప్పండి.
జై హింద్.
Wednesday, July 27, 2011
Tuesday, July 12, 2011
నచ్చిన డ్యూయెట్
ఎప్పుడు చూసినా నా ఫ్రెండ్ కార్లో ఈ పాట మోత మోగుతూ ఉండేది. ఏదో సినిమా పేరు చెప్పాడు గాని మనకి తమిళం అస్సలు రాదు కాబట్టి , ఏ సినిమా అయితే ఏం అని పాటని ఎంచక్కా ఎంజాయ్ చేసేవాడిని.పాట ట్యూన్ చాలా కేచీ గా ఉండేది. ఆ తరువాతెప్పుడో యు ట్యూబ్ లో ఏదో వెతుకుతూ ఉంటే ఆ పాట నా కంట పడింది. వినటానికే కాదు చూడటానికి కూడా చాలా బాగుంది. మంచి కోరియోగ్రఫీ, కేమెరా, అన్నిటికీ మించి చలాగ్గా ,చిలిపిగా మీరా జాస్మిన్. ..
మీరా జాస్మిన్ మంచి నటి అని తెలుసుగాని ఆమె సినిమాలు పెద్దగా చూసిన గుర్తు లేదు. ఈపాట లో మాత్రం తెగ నచ్చేసింది నాకు. పాట సాహిత్యం కూడా బాగుండొచ్చేమో అని అనుకుంటున్నాను.
(ఈ పాటని బ్లాగర్ లో embed చేయటానికి అనుమతి ఉన్నట్టు లేదు. Watch on YouTube మీద క్లిక్ చేస్తే ఓపెన్ కావచ్చు.)
మీరా జాస్మిన్ మంచి నటి అని తెలుసుగాని ఆమె సినిమాలు పెద్దగా చూసిన గుర్తు లేదు. ఈపాట లో మాత్రం తెగ నచ్చేసింది నాకు. పాట సాహిత్యం కూడా బాగుండొచ్చేమో అని అనుకుంటున్నాను.
(ఈ పాటని బ్లాగర్ లో embed చేయటానికి అనుమతి ఉన్నట్టు లేదు. Watch on YouTube మీద క్లిక్ చేస్తే ఓపెన్ కావచ్చు.)
Tuesday, March 29, 2011
ఏవి తల్లీ నిరుడు కురిసిన ..
మొన్నీ మధ్యే బ్లాగుల్లో చదివాను మనలో చాలా మందికి టీవీ చూడ్డం మా చెడ్డ చిరాగ్గా ఉందనీ, దానికి బదులు ఏపనీ చేయకుండా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడం కూడా చాలా ఉత్తమమనీనూ. ఎందుక్కాదూ?
దేశం కాని దేశంలో ఉన్నాం కదా, ఎంతైనా మన దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే ఎలా అని ఏదో ఒక న్యూస్ చానల్ పెడతానా, అందులో న్యూస్ ఏమాత్రం ఉండదు, అంతా న్యూసేన్సే. నేను చూసేదే కంప్యూటర్లో , చిన్న స్క్రీన్. దానికి తోడు ఆ చానల్ స్క్రీన్ కింద సగం ఏవేవో స్క్రోలింగ్ వార్తలు. నాకు మాత్రం ఆ స్క్రీన్ సాఫ్ట్ వేర్ కంపనీ బేనర్లతో నిండిపోయిన సగటు అమీర్ పేట్ బిల్దింగులా కనపడుతోంది. మొన్న అలా చూస్తూ ఏమా స్క్రోలింగ్ న్యూస్ అని చూద్దును కదా , ఆహా ఏమా ఫ్లాష్ న్యూస్.
"వదిన గొంతు కోసి హత్య చేసిన మరిది. ఫలానా ఊళ్ళో దారుణం ".
అసలది చెప్పాల్సిన వార్తే కాదు. కాదూ కూడదూ , అనుకున్నారనుకోండి, మరీ అంత అర్జంటుగా స్క్రోలింగ్ వేసి మరీ చెప్పాలా? అంత అర్జంటుగా ఆ వార్త తెలుసుకొని రాష్ట్ర ప్రజలు చేసేదేముంది? బహుశా రాష్ట్రం లోని వదినలందరినీ అప్రమత్తం చేయటానికి చెప్పారేమో ( హి హి హి) ..
లొంగిపోయిన ఏ మాజీ నక్సలైటో ,లేదా ఫ్యాక్షనిష్టో హరీ మన్నాడనుకోండి ఇక వాళ్లకి పండగే పండగ.బోల్డంత గడ్డి వాళ్ళు తినడానికీ,మనకి పెట్టడానికీ. చనిపోయిన వాళ్ళెవరూ ?ఎలాంటి వాళ్ళూ? అనేది అనవసరం,అప్రస్తుతం.ఒక రకమైన హీరో వర్షిప్ వాళ్లకి ఆపాదించే వరకూ నిద్రపోవా చానెళ్ళు. దానికి తోడు ఫుల్ స్టాప్ అన్నది లేకుండా,గిన్నీసు బుక్కులోకెక్క దగినంత పొడుగాటి వ్యాఖ్యానాలతో లైవ్ రిపోర్టర్లూ
ఇలా చెప్పటానికి చాలా ఉంటాయి గాని, మరీ దారుణంగా వ్యభిచార నేరం కింద అరెస్టయిన ఒక నటీమణి ని స్టూడియోకి పిలిపించిమరీ అరగంట లైవ్ ప్రోగ్రాం ఇవ్వటం మాత్రం నేనెప్పటికీ జీర్ణించుకోలేని విషయం. (ఆమె ఆ తప్పు చేసారా లేదా అనేది అప్రస్తుతం.)
మళ్ళా ఈ ఫ్లాష్ న్యూస్ దగ్గర కొద్దాం. నా చిన్నప్పుడు వార్తలు తెలుసుకోవాలంటే రేడియో ఒక్కటే శరణ్యం, అదే ఎనభై ల చివర్లో అయితే రేడియోతో పాటు దూరదర్శన్. వాటిల్లో ఈ ఫ్లాష్ న్యూసుల్ని, నిర్ధారించుకున్న తరువాత, "ఇప్పుడే అందిన వార్త" గా అందించేవారు. వార్తలయిపోయాక ఆ నోటా,ఈ నోటా పడి మనం ఏదైనా వేరే వార్త విన్నామనుకోండి, దాన్ని నిర్ధారించుకోవాలంటే మళ్ళా వార్తల టైం వరకు ఆగాల్సిందే. అలానే విన్న వార్త గురించి సవివరంగా చదవాలంటే ఆ మరుసటిరోజు వచ్చేపేపరే శరణ్యం. నిజం చెప్పొద్దూ ఆ ఎదురుచూపు ఎంత బావుండేదో. పొద్దున్నే పేపరు వచ్చినట్టు తెలియగానే బెడ్డు మీంచి లేచి రివ్వున పరిగెత్తే వాణ్ని.
తెలుసుకొనే హక్కు మనకూ, తెలియ చేసే హక్కు వాళ్ళకూ ఉన్నా, తెలిపే దాంట్లో తెలియకూడనిదే ఎక్కువుంటే, అసలు తెలుసుకోకపోవడమే ఉత్తమమని నా అభిప్రాయం.
కొసమెరుపు:
ఇహ పొతే ఈరోజు ఈనాడు లో " సమరం నేడే" అంటూ ఇండియా పాకిస్తాను క్రికెట్ మ్యాచు గురించి నేను చదివిన ఆణిముత్యాలు .
" వేగానికి కొలతలున్నాయ్ , కొలిచే పరికరాలున్నాయ్. వేడికి థర్మా మీటరుంది.కానీ ఉద్వేగాల్ని కొలిచేవేమైనా ఉన్నాయా?ఉంటే అవన్నీ ఈరోజు అవన్నీ ఈరోజు భారత్,పాకిస్తాన్ లలో కచ్చితంగా బద్దలైపోయేవే.
ఈ మ్యాచ్ పై నెలకొన్న ఉత్కంఠనూ ,ఉద్వేగాల్నీ కరెంటు గా మారిస్తే పవర్ కట్లు లేని ప్రపంచాన్నీ..ధనం గా మారిస్తే పేదరికం తెలియని సమాజాన్నీ , పచ్చదనంగా మారిస్తే కాలుష్యం లేని విశ్వాన్నీచూడొచ్చేమో"
అయ్యా, అదీ సంగతి .ఎలా ఉంది? కరంటు షాకు కొట్టినట్టు లేదూ?
ఎనీ హౌ, గత కొన్ని నెలలుగా టీవీ చూడడం , అలానే పేపరు చదవటం బాగా తగ్గించాను. రేడియో బాగా వింటున్నాను. ప్రాణానికి హాయిగా ఉంది.
దేశం కాని దేశంలో ఉన్నాం కదా, ఎంతైనా మన దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే ఎలా అని ఏదో ఒక న్యూస్ చానల్ పెడతానా, అందులో న్యూస్ ఏమాత్రం ఉండదు, అంతా న్యూసేన్సే. నేను చూసేదే కంప్యూటర్లో , చిన్న స్క్రీన్. దానికి తోడు ఆ చానల్ స్క్రీన్ కింద సగం ఏవేవో స్క్రోలింగ్ వార్తలు. నాకు మాత్రం ఆ స్క్రీన్ సాఫ్ట్ వేర్ కంపనీ బేనర్లతో నిండిపోయిన సగటు అమీర్ పేట్ బిల్దింగులా కనపడుతోంది. మొన్న అలా చూస్తూ ఏమా స్క్రోలింగ్ న్యూస్ అని చూద్దును కదా , ఆహా ఏమా ఫ్లాష్ న్యూస్.
"వదిన గొంతు కోసి హత్య చేసిన మరిది. ఫలానా ఊళ్ళో దారుణం ".
అసలది చెప్పాల్సిన వార్తే కాదు. కాదూ కూడదూ , అనుకున్నారనుకోండి, మరీ అంత అర్జంటుగా స్క్రోలింగ్ వేసి మరీ చెప్పాలా? అంత అర్జంటుగా ఆ వార్త తెలుసుకొని రాష్ట్ర ప్రజలు చేసేదేముంది? బహుశా రాష్ట్రం లోని వదినలందరినీ అప్రమత్తం చేయటానికి చెప్పారేమో ( హి హి హి) ..
లొంగిపోయిన ఏ మాజీ నక్సలైటో ,లేదా ఫ్యాక్షనిష్టో హరీ మన్నాడనుకోండి ఇక వాళ్లకి పండగే పండగ.బోల్డంత గడ్డి వాళ్ళు తినడానికీ,మనకి పెట్టడానికీ. చనిపోయిన వాళ్ళెవరూ ?ఎలాంటి వాళ్ళూ? అనేది అనవసరం,అప్రస్తుతం.ఒక రకమైన హీరో వర్షిప్ వాళ్లకి ఆపాదించే వరకూ నిద్రపోవా చానెళ్ళు. దానికి తోడు ఫుల్ స్టాప్ అన్నది లేకుండా,గిన్నీసు బుక్కులోకెక్క దగినంత పొడుగాటి వ్యాఖ్యానాలతో లైవ్ రిపోర్టర్లూ
ఇలా చెప్పటానికి చాలా ఉంటాయి గాని, మరీ దారుణంగా వ్యభిచార నేరం కింద అరెస్టయిన ఒక నటీమణి ని స్టూడియోకి పిలిపించిమరీ అరగంట లైవ్ ప్రోగ్రాం ఇవ్వటం మాత్రం నేనెప్పటికీ జీర్ణించుకోలేని విషయం. (ఆమె ఆ తప్పు చేసారా లేదా అనేది అప్రస్తుతం.)
మళ్ళా ఈ ఫ్లాష్ న్యూస్ దగ్గర కొద్దాం. నా చిన్నప్పుడు వార్తలు తెలుసుకోవాలంటే రేడియో ఒక్కటే శరణ్యం, అదే ఎనభై ల చివర్లో అయితే రేడియోతో పాటు దూరదర్శన్. వాటిల్లో ఈ ఫ్లాష్ న్యూసుల్ని, నిర్ధారించుకున్న తరువాత, "ఇప్పుడే అందిన వార్త" గా అందించేవారు. వార్తలయిపోయాక ఆ నోటా,ఈ నోటా పడి మనం ఏదైనా వేరే వార్త విన్నామనుకోండి, దాన్ని నిర్ధారించుకోవాలంటే మళ్ళా వార్తల టైం వరకు ఆగాల్సిందే. అలానే విన్న వార్త గురించి సవివరంగా చదవాలంటే ఆ మరుసటిరోజు వచ్చేపేపరే శరణ్యం. నిజం చెప్పొద్దూ ఆ ఎదురుచూపు ఎంత బావుండేదో. పొద్దున్నే పేపరు వచ్చినట్టు తెలియగానే బెడ్డు మీంచి లేచి రివ్వున పరిగెత్తే వాణ్ని.
తెలుసుకొనే హక్కు మనకూ, తెలియ చేసే హక్కు వాళ్ళకూ ఉన్నా, తెలిపే దాంట్లో తెలియకూడనిదే ఎక్కువుంటే, అసలు తెలుసుకోకపోవడమే ఉత్తమమని నా అభిప్రాయం.
కొసమెరుపు:
ఇహ పొతే ఈరోజు ఈనాడు లో " సమరం నేడే" అంటూ ఇండియా పాకిస్తాను క్రికెట్ మ్యాచు గురించి నేను చదివిన ఆణిముత్యాలు .
" వేగానికి కొలతలున్నాయ్ , కొలిచే పరికరాలున్నాయ్. వేడికి థర్మా మీటరుంది.కానీ ఉద్వేగాల్ని కొలిచేవేమైనా ఉన్నాయా?ఉంటే అవన్నీ ఈరోజు అవన్నీ ఈరోజు భారత్,పాకిస్తాన్ లలో కచ్చితంగా బద్దలైపోయేవే.
ఈ మ్యాచ్ పై నెలకొన్న ఉత్కంఠనూ ,ఉద్వేగాల్నీ కరెంటు గా మారిస్తే పవర్ కట్లు లేని ప్రపంచాన్నీ..ధనం గా మారిస్తే పేదరికం తెలియని సమాజాన్నీ , పచ్చదనంగా మారిస్తే కాలుష్యం లేని విశ్వాన్నీచూడొచ్చేమో"
అయ్యా, అదీ సంగతి .ఎలా ఉంది? కరంటు షాకు కొట్టినట్టు లేదూ?
ఎనీ హౌ, గత కొన్ని నెలలుగా టీవీ చూడడం , అలానే పేపరు చదవటం బాగా తగ్గించాను. రేడియో బాగా వింటున్నాను. ప్రాణానికి హాయిగా ఉంది.
Thursday, March 4, 2010
భయపెట్టి, బెంబేలెత్తించే వార్తలు
మీడియా మీద మళ్ళీ మరో పోస్టు. మీడియా మీదే ఎందుకు అంటారా? ఏదో నా అభిమానం.
ఇది మళ్ళీ నా అభిమాన దినపత్రిక "ఈనాడు" గురించే.ఏంచేస్తాం, నేను వేరేవి అంతగా చదవను.అప్పుడప్పుడూ జ్యోతి,సాక్షి చదవటం అలవాటు చేసుకుంటున్నా.కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కొన్నాళ్ళకి అసలు పేపరు చదవటం మానేస్తానేమో. ఎందుకంటే చాలా రోజులయింది చూసి కదాని కొన్ని రోజుల క్రితం జ్యోతి పేపర్ చూసా. నా ఖర్మ కాలి ఆరోజు బేనర్ న్యూస్ ఏమనుకున్నారు? మన సానియా మీర్జా తాలూకు రద్దైన వివాహ నిశ్చితార్దం. తేరుకోటానికి కొంత సమయం పట్టింది ఆరోజు.
ఇక విషయానికొస్తే,నిన్నటి పేపర్లో హైదరాబాదులో జరిగిన విమాన ప్రమాదం గురించి రాసారు. జరిగింది దారుణం.చనిపోయిన పైలట్లకు నా నివాళి. ఇకపోతే మన పేపర్లో ఈ వార్త రాసి, హెడ్డింగులో ప్రాస కోసం ఎప్పటిలానే ప్రయాసపడి, ఆనక కింద ఆ ప్రమాదం తాలూకు ఫోటో కూడా ప్రచురించారు.ఆ ఫోటో కింద ఒక వ్యాఖ్య కూడా " చిధ్రమైన మృతదేహాలు" అంటూ. ఆ ఫోటో చూసిన వారెవరైనా ఆ వార్త తాలూకు విషాదం పక్కనబెట్టి ఠక్కున పేజీ తిప్పక మానరు. అసలు అటువంటి ఫోటో ప్రచురించాల్సిన అవసరం ఉందా? బహుశా తొంభై ల మొదట్లో అనుకుంటా ఈ ట్రెండు మొదలయింది. . నక్సలైట్ల మందుపాతరలు పేలి తునా తునకలైన పోలీసుల మృతదేహాల ఫోటోలు ఆరోజుల్లో విరివిగా మొదటిపేజీల్లో చోటు చేసుకున్నాయి(అదీ కలర్లో). వార్త తాలూకు తీవ్రతనీ,విషాదాన్నీ మనకి అందించాల్సిన పద్దతి ఇదేనా? మొన్న రాజశేఖర్ రెడ్డి మరణ వార్త తాలూకు కవరేజీలోనూ ఇదే తంతు.ఒకవేళ "Sense of reality" ని అందివ్వటం ఆ ఫోటోల ఉద్దేశ్యం అనుకున్నా, మనందరం ఏదో ఒక సందర్భంలో మన రోజువారీ ప్రయాణాల్లో ఎప్పుడో ఒకసారి ఇలాంటివి చూసే ఉంటాం. ఆ రియాలిటీ ఇలా వార్తల రూపంలో మనల్ని వెంటాడుతూ మన లివింగ్ రూముల వరకూ రానవసరంలేదు. నిజానికి ఆ ఫోటోతో పోటీ పడుతూ ఉంటాయి ఆ వార్త తాలూకు వివరాలు. అంత డిటైల్డ్ గా రాయాల్సిన అవసరం ఉందా?
ప్రతి పత్రిక్కీ అనేక వర్గాల పాఠకులుంటారు, పిల్లలూ, స్పోర్ట్స్ ప్రేమికులూ, రాజకీయ వార్తలు మాత్రమే చదివేవాళ్ళూ , సాహిత్యం, వంటా-వార్పులు, ఫ్యాషన్ లాంటివి ఇష్టపడేవాళ్ళూ ..ఇలా. కానీ నాకు ఈరకమైన ఫోటోలని ఆసక్తిగా చూసేవాళ్ళు ఎక్కడా కనపడలేదు. నాకు తెలిసిన ప్రతిఒక్కరూ ఈ ఫోటోలు చూడగానే మొహం చిట్లించి పేజీ తిప్పేసే వారే.ఆపరేషను చేసే డాక్టర్లే ఆ ఎర్ర రంగు చూసి బెంబేలు పడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారే,అట్లాంటిది అర్భక పాఠకుల్ని ఇలా భయపెట్టడంన్యాయమా?
ఒక్క మెయిన్ ఎడిషనే కాదు , చివరికి జిల్లా ఎడిషన్లలో కూడా ఇదే వరస.గుడ్డి కంటే మెల్ల నయం అన్నట్టు, అవి బ్లాక్ అండ్ వైటు లో ఉన్నాయిలే అని సరిపెట్టుకోవాలో ఏమో..ఖర్మ
ఇది మళ్ళీ నా అభిమాన దినపత్రిక "ఈనాడు" గురించే.ఏంచేస్తాం, నేను వేరేవి అంతగా చదవను.అప్పుడప్పుడూ జ్యోతి,సాక్షి చదవటం అలవాటు చేసుకుంటున్నా.కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కొన్నాళ్ళకి అసలు పేపరు చదవటం మానేస్తానేమో. ఎందుకంటే చాలా రోజులయింది చూసి కదాని కొన్ని రోజుల క్రితం జ్యోతి పేపర్ చూసా. నా ఖర్మ కాలి ఆరోజు బేనర్ న్యూస్ ఏమనుకున్నారు? మన సానియా మీర్జా తాలూకు రద్దైన వివాహ నిశ్చితార్దం. తేరుకోటానికి కొంత సమయం పట్టింది ఆరోజు.
ఇక విషయానికొస్తే,నిన్నటి పేపర్లో హైదరాబాదులో జరిగిన విమాన ప్రమాదం గురించి రాసారు. జరిగింది దారుణం.చనిపోయిన పైలట్లకు నా నివాళి. ఇకపోతే మన పేపర్లో ఈ వార్త రాసి, హెడ్డింగులో ప్రాస కోసం ఎప్పటిలానే ప్రయాసపడి, ఆనక కింద ఆ ప్రమాదం తాలూకు ఫోటో కూడా ప్రచురించారు.ఆ ఫోటో కింద ఒక వ్యాఖ్య కూడా " చిధ్రమైన మృతదేహాలు" అంటూ. ఆ ఫోటో చూసిన వారెవరైనా ఆ వార్త తాలూకు విషాదం పక్కనబెట్టి ఠక్కున పేజీ తిప్పక మానరు. అసలు అటువంటి ఫోటో ప్రచురించాల్సిన అవసరం ఉందా? బహుశా తొంభై ల మొదట్లో అనుకుంటా ఈ ట్రెండు మొదలయింది. . నక్సలైట్ల మందుపాతరలు పేలి తునా తునకలైన పోలీసుల మృతదేహాల ఫోటోలు ఆరోజుల్లో విరివిగా మొదటిపేజీల్లో చోటు చేసుకున్నాయి(అదీ కలర్లో). వార్త తాలూకు తీవ్రతనీ,విషాదాన్నీ మనకి అందించాల్సిన పద్దతి ఇదేనా? మొన్న రాజశేఖర్ రెడ్డి మరణ వార్త తాలూకు కవరేజీలోనూ ఇదే తంతు.ఒకవేళ "Sense of reality" ని అందివ్వటం ఆ ఫోటోల ఉద్దేశ్యం అనుకున్నా, మనందరం ఏదో ఒక సందర్భంలో మన రోజువారీ ప్రయాణాల్లో ఎప్పుడో ఒకసారి ఇలాంటివి చూసే ఉంటాం. ఆ రియాలిటీ ఇలా వార్తల రూపంలో మనల్ని వెంటాడుతూ మన లివింగ్ రూముల వరకూ రానవసరంలేదు. నిజానికి ఆ ఫోటోతో పోటీ పడుతూ ఉంటాయి ఆ వార్త తాలూకు వివరాలు. అంత డిటైల్డ్ గా రాయాల్సిన అవసరం ఉందా?
ప్రతి పత్రిక్కీ అనేక వర్గాల పాఠకులుంటారు, పిల్లలూ, స్పోర్ట్స్ ప్రేమికులూ, రాజకీయ వార్తలు మాత్రమే చదివేవాళ్ళూ , సాహిత్యం, వంటా-వార్పులు, ఫ్యాషన్ లాంటివి ఇష్టపడేవాళ్ళూ ..ఇలా. కానీ నాకు ఈరకమైన ఫోటోలని ఆసక్తిగా చూసేవాళ్ళు ఎక్కడా కనపడలేదు. నాకు తెలిసిన ప్రతిఒక్కరూ ఈ ఫోటోలు చూడగానే మొహం చిట్లించి పేజీ తిప్పేసే వారే.ఆపరేషను చేసే డాక్టర్లే ఆ ఎర్ర రంగు చూసి బెంబేలు పడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారే,అట్లాంటిది అర్భక పాఠకుల్ని ఇలా భయపెట్టడంన్యాయమా?
ఒక్క మెయిన్ ఎడిషనే కాదు , చివరికి జిల్లా ఎడిషన్లలో కూడా ఇదే వరస.గుడ్డి కంటే మెల్ల నయం అన్నట్టు, అవి బ్లాక్ అండ్ వైటు లో ఉన్నాయిలే అని సరిపెట్టుకోవాలో ఏమో..ఖర్మ
Thursday, February 25, 2010
ఈనాటి వార్త
మరీ ఎంత అభిమాన పత్రికైనా ఈరోజు "ఈనాడు" లో సచిన్ డబుల్ సెంచరీ సందర్భంగా రాసిన వార్త చదవగానే భలే చిరాకేసింది. వార్త మెదటి పేరా చదివి నోరెళ్ళ బెట్టాను. ఆ మొదటి పేరా ఇలాఉంది.
"అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ తో మానవాళి చరిత్రను మరో మలుపు తిప్పినప్పుడు, రైట్ బ్రదర్స్ విమానంతో మనిషి ఊహలకు రెక్కలు తొడిగినప్పుడు, నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చందమామ పై తొలిసారిగా కాలుపెట్టినప్పుడు , జిం హిన్స్ వంద మీటర్ల పరుగుకు కళ్ళాలు వేసి తొలిసారిగా పది సెకన్లకంటే తక్కువకి లాక్కొని వచ్చినప్పుడు.. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో అక్షణాలను అనుభవించిన వారంతా పులకించారో లేదో తెలీదు గాని బుధవారం గ్వాలియర్లో సచిన్ సాధించిన వన్డే ద్వి శతకాన్ని కనులారా చూసిన క్రీడా ప్రేమికులు మాత్రం అంతటి మహదానందాన్ని అనుభవించారు "
ఏమని పిస్తోంది? సచిన్ డబల్ సెంచరీ కొట్టాడు.సరే.. సంతోషం..దాంతో పెన్సిలిన్,రైట్ బ్రదర్స్ విమానం, నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చందమామలకేం సంబంధం? జరిగి నలభై యేళ్ళయినా,చందమామ మీద కాలూనడం శాస్త్ర సాంకేతిక రంగంలో ఇప్పటికీ ఒక మైలు రాయి. దానికీ దీనికీ పోలికా?కనీసం పోలికలైనా అతికేట్టు రాయొద్దా? జిం హిన్స్ పోలిక ఒక్కటే క్రీడలకి సంబంధించింది. నా దృష్టిలో అదికూడా అస్సలు అతకలేదు. ఎంతమందికి తెలుసు జిం హిన్స్?
అసలా హెడ్డింగేమిటండీ బాబు, " నీవొక దుర్గం మాకొక స్వర్గం" .. హతవిధీ..ఇంతకంటే మంచిదేమీ తట్టలేదా? ప్చ్
"అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ తో మానవాళి చరిత్రను మరో మలుపు తిప్పినప్పుడు, రైట్ బ్రదర్స్ విమానంతో మనిషి ఊహలకు రెక్కలు తొడిగినప్పుడు, నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చందమామ పై తొలిసారిగా కాలుపెట్టినప్పుడు , జిం హిన్స్ వంద మీటర్ల పరుగుకు కళ్ళాలు వేసి తొలిసారిగా పది సెకన్లకంటే తక్కువకి లాక్కొని వచ్చినప్పుడు.. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో అక్షణాలను అనుభవించిన వారంతా పులకించారో లేదో తెలీదు గాని బుధవారం గ్వాలియర్లో సచిన్ సాధించిన వన్డే ద్వి శతకాన్ని కనులారా చూసిన క్రీడా ప్రేమికులు మాత్రం అంతటి మహదానందాన్ని అనుభవించారు "
ఏమని పిస్తోంది? సచిన్ డబల్ సెంచరీ కొట్టాడు.సరే.. సంతోషం..దాంతో పెన్సిలిన్,రైట్ బ్రదర్స్ విమానం, నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చందమామలకేం సంబంధం? జరిగి నలభై యేళ్ళయినా,చందమామ మీద కాలూనడం శాస్త్ర సాంకేతిక రంగంలో ఇప్పటికీ ఒక మైలు రాయి. దానికీ దీనికీ పోలికా?కనీసం పోలికలైనా అతికేట్టు రాయొద్దా? జిం హిన్స్ పోలిక ఒక్కటే క్రీడలకి సంబంధించింది. నా దృష్టిలో అదికూడా అస్సలు అతకలేదు. ఎంతమందికి తెలుసు జిం హిన్స్?
అసలా హెడ్డింగేమిటండీ బాబు, " నీవొక దుర్గం మాకొక స్వర్గం" .. హతవిధీ..ఇంతకంటే మంచిదేమీ తట్టలేదా? ప్చ్
Tuesday, December 29, 2009
12 Angry men
మొన్న లైబ్రరీకెళ్తే అక్కడ కనపడిందీ నలుపు-తెలుపు ఇంగ్లీషు సినిమా. పేరు 12 Angry men.
తన తండ్రిని హత్య చేసిన నేరం మీద పట్టుబడ్డ ఒక పద్దెనిమిదేళ్ళ బాలుడి మీద కోర్టు విచారణతో సినిమా ఆరంభమవుతుంది. వాదోపవాదాలు ముగిసాక, కేసు ఎటూ తేలక, బాలుడు ముద్దాయా కాదా అనేది నిర్ణయించాల్సిందిగా జ్యూరీ సభ్యులని కోరతాడు జడ్జి. మొత్తం పన్నెండు మంది సభ్యులున్న జ్యూరీ సభ్యులు అందరూ ఒక రూములో సమావేశ మవుతారు. సమావేశం మొదట్లోనే వోట్లేసి మొత్తం పన్నెండు మందిలో పదకొండు మంది ఆ బాలుణ్ణి దోషిగా పరిగణిస్తారు. ఒకే ఒక్కడు మాత్రం కనీసపు చర్చ జరపకుండా, ఒక మనిషి ప్రాణాలకు ఏమాత్రం విలువియ్యకుండా , అంత అనాలోచితంగా ఎలా నిర్ణయిస్తారు అని ఎదురు ప్రశ్నిస్తాడు. ప్రాసిక్యూషన్ వారి లొసుగులు ఎత్తి చూపుతూ,చివరికి తను మిగతా పదకొండుమందిని కన్విన్స్ చేసాడా లేదా అనేది మీ వూహకే వదిలేస్తున్నా.. ( హి హి హి)..
చెప్పాలనుకుంటె ఈ సినిమా గురించి చాలా చెప్పాలి. సినిమా మొదట్లో చూపించే కోర్టు గదీ , చివర్లో అందరూ కోర్టు మెట్లుదిగి బయటికి వచ్చే షాట్ నీ మినహాయిస్తే, సినిమా మొత్తం ఒకేగదిలో షూట్ చేసారు. అయితే మనకెక్కడా ఏమాత్రం విసుగనిపించదు. ఇలాంటి సినిమాలు కేమెరా మెన్లకి పెద్ద సవాలు. ఎక్కడా మొనాటనీ లేకుండా గదంతా గిర్రున తిరుగుతూ ఉంటుంది కేమెరా. జ్యూరీ సభ్యులు గదిలోకి ప్రవేశించే సీన్ మొత్తం ఆరునిమిషాలు పైనే ఉంటుంది. అంతా ఒకేషాట్లో తీసారు. ( ఒక్క క్షణం నాకు "గుడ్ ఫెల్లాస్" గుర్తొచ్చింది, అందులో కూడా ఒకషాట్ ఇలానే ఉంటుంది).
సినిమా ముగిసాక పన్నెండు మందీ మనకు గుర్తుంటారంటే ఆ క్రెడిట్ స్క్రిప్ట్ దే మరి.ఒక సాదా సీదా కథని మంచి స్క్రిప్ట్తో ప్రేక్షకులని కట్టిపడేసేలా ఎలా తీయొచ్చో ఈ సినిమా చూస్తే అర్ధమవుతుంది.
నటుల నటన పరంగా కూడా అద్భుతమైన సినిమా.తప్పక చూడవలసిన చిత్రం ఇది.
( నటీ నటులు, దర్శకుల వివరాలు ఏమీ ఇవ్వడం లేదు. ఇంటర్నెట్ ఉండగా అవన్నీ ఇక్కడ ఎందుకులే అనిపించి :) )
తన తండ్రిని హత్య చేసిన నేరం మీద పట్టుబడ్డ ఒక పద్దెనిమిదేళ్ళ బాలుడి మీద కోర్టు విచారణతో సినిమా ఆరంభమవుతుంది. వాదోపవాదాలు ముగిసాక, కేసు ఎటూ తేలక, బాలుడు ముద్దాయా కాదా అనేది నిర్ణయించాల్సిందిగా జ్యూరీ సభ్యులని కోరతాడు జడ్జి. మొత్తం పన్నెండు మంది సభ్యులున్న జ్యూరీ సభ్యులు అందరూ ఒక రూములో సమావేశ మవుతారు. సమావేశం మొదట్లోనే వోట్లేసి మొత్తం పన్నెండు మందిలో పదకొండు మంది ఆ బాలుణ్ణి దోషిగా పరిగణిస్తారు. ఒకే ఒక్కడు మాత్రం కనీసపు చర్చ జరపకుండా, ఒక మనిషి ప్రాణాలకు ఏమాత్రం విలువియ్యకుండా , అంత అనాలోచితంగా ఎలా నిర్ణయిస్తారు అని ఎదురు ప్రశ్నిస్తాడు. ప్రాసిక్యూషన్ వారి లొసుగులు ఎత్తి చూపుతూ,చివరికి తను మిగతా పదకొండుమందిని కన్విన్స్ చేసాడా లేదా అనేది మీ వూహకే వదిలేస్తున్నా.. ( హి హి హి)..
చెప్పాలనుకుంటె ఈ సినిమా గురించి చాలా చెప్పాలి. సినిమా మొదట్లో చూపించే కోర్టు గదీ , చివర్లో అందరూ కోర్టు మెట్లుదిగి బయటికి వచ్చే షాట్ నీ మినహాయిస్తే, సినిమా మొత్తం ఒకేగదిలో షూట్ చేసారు. అయితే మనకెక్కడా ఏమాత్రం విసుగనిపించదు. ఇలాంటి సినిమాలు కేమెరా మెన్లకి పెద్ద సవాలు. ఎక్కడా మొనాటనీ లేకుండా గదంతా గిర్రున తిరుగుతూ ఉంటుంది కేమెరా. జ్యూరీ సభ్యులు గదిలోకి ప్రవేశించే సీన్ మొత్తం ఆరునిమిషాలు పైనే ఉంటుంది. అంతా ఒకేషాట్లో తీసారు. ( ఒక్క క్షణం నాకు "గుడ్ ఫెల్లాస్" గుర్తొచ్చింది, అందులో కూడా ఒకషాట్ ఇలానే ఉంటుంది).
సినిమా ముగిసాక పన్నెండు మందీ మనకు గుర్తుంటారంటే ఆ క్రెడిట్ స్క్రిప్ట్ దే మరి.ఒక సాదా సీదా కథని మంచి స్క్రిప్ట్తో ప్రేక్షకులని కట్టిపడేసేలా ఎలా తీయొచ్చో ఈ సినిమా చూస్తే అర్ధమవుతుంది.
నటుల నటన పరంగా కూడా అద్భుతమైన సినిమా.తప్పక చూడవలసిన చిత్రం ఇది.
( నటీ నటులు, దర్శకుల వివరాలు ఏమీ ఇవ్వడం లేదు. ఇంటర్నెట్ ఉండగా అవన్నీ ఇక్కడ ఎందుకులే అనిపించి :) )
Sunday, December 20, 2009
నిరాశపరిచిన అవతార్
అప్పుడెప్పుడో జంధ్యాల, విశ్వనాథ్ , ఆ తరువాత మణిరత్నం సినిమాలు మినహాయించి గత కొన్నేళ్లుగా పలానా సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూసిన గుర్తు లేదు. ఈ "అవతార్" సినిమా కోసం మాత్రం డిసెంబరు మొదటినుంచే ఎప్పుడు రిలీజవుతుందా అని ఎదురుచూసా. రిలీజయిన రోజే చూసేసా. మొత్తానికి నిరాశే మిగిల్చింది. బహుశా మరీ ఎక్కువ ఊహించుకున్నందువల్లనేమో అనిపించింది మొదట్లో. తరువాత ఆలోచిస్తే అనిపించింది అదేమాత్రం కారణం కాదని.
సినిమాలో వాడిన గ్రాఫిక్ వర్కుని మినహాయిస్తే కథా, కథన పరంగా ఇదొక "బి" గ్రేడు సినిమా. ఇంత నాసిరకం కథనాన్ని కేమరూన్ నుంచి ఊహించలేదు. బహుశా గ్రాఫిక్స్ మీద పెట్టిన శ్రద్ద కథనాన్ని దెబ్బ తీసిందేమో. అద్భుత ప్రపంచాన్ని సృష్టించినా ( నాకలా అనిపించలేదనుకోండి),కథలో లీనం కాలేనప్పుడు ఏమి లాభం. కథ మొదట్లో మనకి పరిచయం చేసే ఆ వింత జంతువులు చివర్లో ఆ గ్రహాన్ని ఆక్రమించుకోవటానికి వచ్చిన శత్రువులని ( మనుష్య జాతిని ) తరమడానికే అన్నట్లు అనిపిస్తుంది. అలానే హీరోని గ్రూపు లీడరుగా అంగీకరించేలా చేయడానికి హడావిడిగా ఆయన్ని ఆ ఎర్ర డ్రాగన్ ( అది డ్రాగనో ఇంకేదో ) ఎక్కించినట్టు అనిపిస్తుంది. మొదటినుంచి చిన్న సమూహంలా అనిపించే పెండురా గ్రహవాసులు తెగలు తెగలుగా బోల్డుమంది ఉన్నట్టు చెప్పడం క్లైమాక్సు కోసమే అనిపిస్తుంది. మరీ హీరో ఒక్కడే ఒంటి చేత్తో శత్రువులని చితకబాదినట్టు చూపిస్తే బాగోదని అర్జెంటుగా ఇంకో కేరక్టరు ( తెగ నాయకుడు ) సహాయం తీసుకున్నట్లనిపిస్తుంది. ఇలాంటివి చేయకూడదని కాదు. దేన్నైనా అలవోకగా అల్లినట్టు చెప్పాలిగాని, అతుకేసి కుట్టినట్లుగా కాదు. ఇలా చెప్పదలచుకుంటే చాలా ఉన్నాయి.
బహుశా ఆ అద్భుత ప్రపంచాన్ని సృష్టించటానికి కేమరూన్ చాలా కష్టపడి ఉండొచ్చు. దానికి వాడిన టెక్నాలజీ భవిష్యత్ తరానికి బైబిలు లాంటిదే కావచ్చు. కానీ ఆ తెరవెనుక విషయాలు నాలాంటి సగటు ప్రేక్షకునికి అనవసరం. ఈ కథ గత పదేళ్లుగా కేమరూన్ మదిలో నలుగుతున్నది అంటే అంగీకరించటం కష్టమే.
నేను ఈ సినిమా త్రీడీ లోనే చూసా. ఇప్పుడొస్తున్న మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలోని గ్రాఫిక్స్ చాలా బావున్నాయిగాని, మిగతా సినిమాల్లోని గ్రాఫిక్స్ ఒకెత్తు, ఇవి ఇంకో ఎత్తు అన్నంత వైవిధ్యంగా ఏమీలేవు. (నా దృష్టిలో ఇప్పటికీ టెర్మినేటర్-2 గ్రాఫిక్స్ పరంగా అద్భుతమయిన సినిమా.)
ఏదో నా ఆసక్తి కొద్దీ ఇంకో విషయం. కొన్ని సినిమాలకు ఒక సిగ్నేచరు ట్యూన్ ఉంటుంది. ( దాన్ని సినిమా పరిభాషలో ఏమంటారో నాకు తెలీదు). Troy ( కొత్తది) సినిమాలో ఒక ట్యూన్, మక్కీకి మక్కీ అదే ట్యూన్"Enemy at the gates సినిమాలో, సినిమా అంతా రిపీటెడ్ గా వినబడుతూ ఉంటుంది( వింటానికి చాలా బాగుంటుంది అది). అదేట్యూన్ ఈ సినిమా మొదట్లో ఒక క్షణకాలం వినబడుతుంది. అలానే సినిమా మధ్యలో టైటానిక్ సినిమాలో వాడిన మరో ట్యూన్.
చివరగా ఈ సినిమా ఇచ్చే సందేశం? ?? నాకయితే ఏరకమయిన సందేశం కనిపించలేదు. ఆయన దేన్నైతే అనుకున్నాడో, దాన్ని ఆయన అనుకున్న స్థాయికి తగ్గకుండా తీసినట్టు అనిపించింది. అంతే..
సినిమాలో వాడిన గ్రాఫిక్ వర్కుని మినహాయిస్తే కథా, కథన పరంగా ఇదొక "బి" గ్రేడు సినిమా. ఇంత నాసిరకం కథనాన్ని కేమరూన్ నుంచి ఊహించలేదు. బహుశా గ్రాఫిక్స్ మీద పెట్టిన శ్రద్ద కథనాన్ని దెబ్బ తీసిందేమో. అద్భుత ప్రపంచాన్ని సృష్టించినా ( నాకలా అనిపించలేదనుకోండి),కథలో లీనం కాలేనప్పుడు ఏమి లాభం. కథ మొదట్లో మనకి పరిచయం చేసే ఆ వింత జంతువులు చివర్లో ఆ గ్రహాన్ని ఆక్రమించుకోవటానికి వచ్చిన శత్రువులని ( మనుష్య జాతిని ) తరమడానికే అన్నట్లు అనిపిస్తుంది. అలానే హీరోని గ్రూపు లీడరుగా అంగీకరించేలా చేయడానికి హడావిడిగా ఆయన్ని ఆ ఎర్ర డ్రాగన్ ( అది డ్రాగనో ఇంకేదో ) ఎక్కించినట్టు అనిపిస్తుంది. మొదటినుంచి చిన్న సమూహంలా అనిపించే పెండురా గ్రహవాసులు తెగలు తెగలుగా బోల్డుమంది ఉన్నట్టు చెప్పడం క్లైమాక్సు కోసమే అనిపిస్తుంది. మరీ హీరో ఒక్కడే ఒంటి చేత్తో శత్రువులని చితకబాదినట్టు చూపిస్తే బాగోదని అర్జెంటుగా ఇంకో కేరక్టరు ( తెగ నాయకుడు ) సహాయం తీసుకున్నట్లనిపిస్తుంది. ఇలాంటివి చేయకూడదని కాదు. దేన్నైనా అలవోకగా అల్లినట్టు చెప్పాలిగాని, అతుకేసి కుట్టినట్లుగా కాదు. ఇలా చెప్పదలచుకుంటే చాలా ఉన్నాయి.
బహుశా ఆ అద్భుత ప్రపంచాన్ని సృష్టించటానికి కేమరూన్ చాలా కష్టపడి ఉండొచ్చు. దానికి వాడిన టెక్నాలజీ భవిష్యత్ తరానికి బైబిలు లాంటిదే కావచ్చు. కానీ ఆ తెరవెనుక విషయాలు నాలాంటి సగటు ప్రేక్షకునికి అనవసరం. ఈ కథ గత పదేళ్లుగా కేమరూన్ మదిలో నలుగుతున్నది అంటే అంగీకరించటం కష్టమే.
నేను ఈ సినిమా త్రీడీ లోనే చూసా. ఇప్పుడొస్తున్న మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలోని గ్రాఫిక్స్ చాలా బావున్నాయిగాని, మిగతా సినిమాల్లోని గ్రాఫిక్స్ ఒకెత్తు, ఇవి ఇంకో ఎత్తు అన్నంత వైవిధ్యంగా ఏమీలేవు. (నా దృష్టిలో ఇప్పటికీ టెర్మినేటర్-2 గ్రాఫిక్స్ పరంగా అద్భుతమయిన సినిమా.)
ఏదో నా ఆసక్తి కొద్దీ ఇంకో విషయం. కొన్ని సినిమాలకు ఒక సిగ్నేచరు ట్యూన్ ఉంటుంది. ( దాన్ని సినిమా పరిభాషలో ఏమంటారో నాకు తెలీదు). Troy ( కొత్తది) సినిమాలో ఒక ట్యూన్, మక్కీకి మక్కీ అదే ట్యూన్"Enemy at the gates సినిమాలో, సినిమా అంతా రిపీటెడ్ గా వినబడుతూ ఉంటుంది( వింటానికి చాలా బాగుంటుంది అది). అదేట్యూన్ ఈ సినిమా మొదట్లో ఒక క్షణకాలం వినబడుతుంది. అలానే సినిమా మధ్యలో టైటానిక్ సినిమాలో వాడిన మరో ట్యూన్.
చివరగా ఈ సినిమా ఇచ్చే సందేశం? ?? నాకయితే ఏరకమయిన సందేశం కనిపించలేదు. ఆయన దేన్నైతే అనుకున్నాడో, దాన్ని ఆయన అనుకున్న స్థాయికి తగ్గకుండా తీసినట్టు అనిపించింది. అంతే..
Subscribe to:
Posts (Atom)
